విద్యుత్ ఉద్యోగులు సమ్మె విరమించాలి : సీఎం

CM-Kiran-Kumar-Reddy-Call-List-leakage......1సమైక్యాంధ్రకు మద్దతుగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె బాట పట్టడంతో… సీమాంధ్రలోని జిల్లాల్లో విద్యుత్ సంక్షోభం నెలకొంది. విద్యుత్ లోటుతో ఎక్కడి రైళ్లు అక్కడే నిలిచిపోయే పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితులను చక్కదిద్దడానికి సీఎం కిరణ్ రంగంలోకి దిగారు. ఈ నేపధ్యంలో ఈ రోజు ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి శాంతి భద్రతలను సమీక్షించారు. ఈ సమీక్షకు డీజీపీ ప్రసాదరావు, నిఘా విభాగం అధికారులతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా కిరణ్ మాట్లాడుతూ… విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోవడంతో… సాధారణ ప్రజానీకం ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని… కాబట్టి విద్యుత్ ఉద్యోగులు వెంటనే సమ్మె విరమించాలని కోరారు.