మీ వైఖరి స్పష్టం చేయండి : అశోక్ బాబు

ashok babuరాష్ట్రం సమైక్యంగా ఉండాలని రెండు నెలలుగా ఉద్యోగులు కడుపులు మాడ్చుకుని ఉద్యమం చేస్తుంటే.. రాజకీయ నాయకులు మాత్రం పదవులు కోసం పాకులాడుతున్నారని విమర్శించారు ఏపీఎన్జీవో నేత అశోక్ బాబ. నోట్ ఇవాళ వస్తుందని తెలిసినా నేతలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని మండిపడ్డారు. కేంద్ర కేబినేట్ తెలంగాణ నోట్ ను ఆమోదిస్తే… ఆ తర్వాత సీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు ఏం చేయబోతారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. ఏపీఎన్జీవో భవన్ లో మీడియాతో మాట్లాడుతూ.. . ప్రస్తుత పరిస్థితులను గమనిస్తుంటే… తెలంగాణ ముసాయిదాను కేంద్ర కేబినేట్ ఆమోదించే అవకాశాలు కనపడుతున్నాయని అన్నారు. దీని తర్వాత ఇది తీర్మానం కోసం మన అసెంబ్లీకి వస్తుందని తెలిపారు. అన్ని స్టేజీలు దాటి అసెంబ్లీకి వచ్చిన తర్వాత.. ఇక్కడున్న ఎమ్మెల్యేలంతా దాన్ని వ్యతిరేకించేలా చూస్తామని అశోక్ బాబు తెలిపారు.