తెలంగాణ నోట్ ఈరోజు (గురువారం) సాయంత్రం జరిగే కేంద్ర కేబినేట్ ముందుకు రాబోతుందని వస్తోందన్న వార్తలన్నీ ఊహాగానాలేనని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండే స్పష్టం చేశారు. ఈ రోజు షిండే విలేకరులతో మాట్లాడుతూ.. టీ-నోట్ రెడీ అయిన మాట వాస్తవమే అయిన.. ఇంత వరకు తాను కూడా సంతకం చేయలేదని పేర్కొన్నారు. నోట్ ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ పరిశీలించాల్సి వుందని, ఆంటోనీ కమిటీ నివేదిక ఇంకా రాలేదని షిండే చెప్పారు. షిండే ప్రకటనతో సీమాంధ్ర నేతలు కాస్త ఊపిరిపీల్చుకున్నట్లు తెలుస్తోంది.