మంచు మనోజ్ కెరీర్లో తొలి కమర్షియల్ హిట్… బిందాస్. ఈ సినిమాతో దర్శకుడు వీరూ పోట్ల తొలి అడుగులోనే విజయం సాధించారు. ఆద్యంతం వినోదాలు పంచిన ఈ చిత్రం… చక్కటి విజయాన్ని సొంతం చేసుకొంది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్ రాబోతోంది. మనోజ్ – వీరూ పోట్ల మరోసారి కలసి పనిచేయబోతున్నారు. ఈ విషయాన్ని దేనికైనా రెడీ ఆడియో వేడుకలో వీరిద్దరూ ధృవీకరించారు. “అవును… త్వరలో నేను వీరూతో బిందాస్ 2 చేయబోతున్నా. వీరూ పోట్లనీ, ఆ సినిమానీ ఎప్పటికీ మర్చిపోలేను. మళ్లీ మేం కలిస్తే ఆ హంగామానే వేరు…“ అని మనోజ్ చెప్పాడు. 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ పతాకంపై మంచు విష్ణు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తారు. ప్రస్తుతం వీరు పోట్ల విష్ణుతో దూసుకెళ్తా సినిమా తీశారు. దసరా కానుకగా వచ్చేనెల 11న ఈ చిత్రాన్ని విడుదల చేస్తారు. బిందాస్ 2 సంబంధించిన పూర్తి వివరాలు త్వరలో తెలుస్తాయి.