బొత్స రాజీనామా!?

botsaపీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ తన మంత్రి పదవికి, పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా సీఎం కిరణ్ సమైక్య రాష్ట్రం కోసం ముఖ్యమంత్రి పదవిని వదులుకోవడానికి సిద్ధమని స్పష్టం చేసిన నేపథ్యంలో ఆయన ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఎంపీలతో చర్చించిన తరువాత రాజీనామా విషయాన్ని స్పష్టం చేసే అవకాశం ఉంది. ఈరోజు ఎంపీలతో సమావేశమైన తరువాత ఆయన కీలక నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. తమ రాజీనామాల ద్వారా అధిష్టానంపై ఒత్తిడి తీసుకు వచ్చేందుకు రాజీనామా అస్త్రాలను ప్రయోగించనున్నట్లు తెలుస్తోంది. ఏదేమైనా రాష్ట్రంలో విభజన రాజకీయాలు వేడెక్కినట్లు కనిపిస్తోంది. ఒకవైపు సీఎం, మరో వైపు బొత్స రాజీనామా వార్తలు రాష్ట్ర రాజకీయాల్లో పెను మార్పులు సృష్టించనున్నాయి.