12 మంది ఉగ్రవాదుల్ని హతమార్చిన పాక్

12-militants-killed-in-pakistanపాక్ భద్రతా దళాలు 12 మంది ఉగ్రవాదుల్ని కాల్చిచంపాయి. పాకిస్థాన్, అఫ్ఘనిస్తాన్ సరిహద్ధుల్లోని భద్రతా దళాలు పెట్రోలింగ్ నిర్వహిస్తుండగా ఆయుధాలు ధరించిన సాయుధులు తారసపడ్డారు. దీంతో ఇరువర్గాల మధ్య జరిగిన కాల్పుల్లో 12 మంది ఉగ్రవాదులు మరణించగా ఇద్దరు సైనికులకు గాయాలయ్యాయని పాక్ తెలిపింది. పాకిస్థాన్-అఫ్ఘానిస్థాన్ సరిహద్దులో శనివారం రాత్రి ఈ సంఘటన జరిగింది.