చర్చలు విఫలం

ashokbabuఎపిఎన్జిఓ నేతలతో ప్రభుత్వం జరిపిన చర్చలు విఫలమయ్యాయి. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ లభించకపోవడంతో సమ్మె విరమించేదిలేదని నేతలు చెప్పారు. హైదరాబాద్ లో మంత్రి వర్గ ఉపసంఘంతో జరిగిన చర్చలు విఫలమైన తరువాత ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు మాట్లాడుతూ..  విభజన వల్ల అన్ని రంగాల ఉద్యోగులు ఎంతలా, ఏ రకంగా నష్టపోతారో తెలిపామన్నారు. వివిధ ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ఉపసంఘం దృష్టికి తీసుకెళ్లాయని అన్నారు. స్పష్టమైన ప్రకటన వచ్చేవరకు ఉద్యమాన్ని కొనసాగిస్తామని చెప్పారు.