రాజీనామాలు చేస్తే తీర్మానాన్ని అడ్డుకునేదెలా..?

erasuరాజీనామాలు చేస్తే రాష్ట్రపతి పాలన పెట్టైనా తెలంగాణ తీర్మానం చేయించుకునే ప్రమాదముందని న్యాయశాఖామంత్రి ఏరాసు ప్రతాప్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. అసెంబ్లీలో తీర్మానాన్ని అడ్డుకోవాలంటే పదవులకు రాజీనామాలు చేస్తే ఎలా సాధ్యపడుతుందని ప్రశ్నించారు. ప్రజాప్రతినిథులు రాజీనామాలు చేస్తే మంచి కన్నా చెడే ఎక్కువ జరుగుతుందని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు కట్టుబడి పదవులకు రాజీనామాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని అన్నారు. అయితే అసెంబ్లీలో తీర్మానాన్ని ఓడించిన మరుక్షణం పదవులను వదులకుంటామని తెలిపారు.