తాను రాష్ట్ర డిజీపీ కాకముందే తనను కొందరు టార్గెట్ చేశారని నగర పోలీస్ బాస్ దినేష్ రెడ్డి అంటున్నారు. తనపై వచ్చిన అక్రమాస్తుల ఆరోపణలపై ఈరోజు డీజీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వివరణ ఇస్తూ.. తాను పోలీస్ చీఫ్ గా రాకముందే తనపై హోం మంత్రికి ఫిర్యాదులు పంపారని వెల్లడించారు. అయితే, వాటిలో ఫిర్యాదు దారుడి పేరు లేకపోవడంతో హోం శాఖ వాటిని పక్కనబెట్టిందని చెప్పుకొచ్చారు. డీజీపీ పదవి తనకు దక్కకుండా చేసేందుకు కొన్ని పిటిషన్ లు కూడా వేశారని, వాస్తవాలు ఏవీ ఆ పిటిషన్లలో ఉండవన్న సంగతి వారికీ తెలుసని ఆయన అన్నారు. ఇటీవలే ఎంపీ సంతకాన్ని ఫోర్జరీ చేసి మళ్ళీ తనపై కేసు నమోదు చేశారని పోలీస్ బాస్ పేర్కొన్నారు.