అక్కినేని హీరోలు..నాగేశ్వరరావు, నాగార్జున,నాగచైతన్య ఈ ముగ్గురూ కలసి నటిస్తున్న చిత్రం మనం. ఇష్క్ సినిమాతో ఆకట్టుకొన్న విక్రమ్ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ తెరకెక్కిస్తోంది. తొలిసారి ఈ మూడు తరాల నటులూ కలసి కెమెరా ముందుకు రాబోతున్నారు.ఈ చిత్రం ఫస్ట్ లుక్ అక్కినేని పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేశారు. ఈ సందర్భంగా నాగ్ మాట్లాడుతూ.. ‘నాన్న 90వ బర్త్ డే సందర్భంగా ‘మనం’ఫస్ట్ లుక్ రిలీజ్ చేస్తున్నందుకు చాల ఆనందగా వుంది. ఈ చిత్రం అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థకు ప్రతిష్టాత్మక చిత్రం అవుతుందని అన్నారు’.