సమైక్యం కోసం ఢిల్లీలో ధర్నా.. !

seemandra-employeesఈనెల 27న రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా.. ఢిల్లీలో ధర్నా చేపట్టాలని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగులు నిర్ణయించారు. ఉద్యోగులంతా సామూహికంగా సమైక్యం కోసం జంతర్ మంతర్ వద్ద ధర్నా చేపడతామని పేర్కొన్నారు. అంతేకాకుండా.. ఈ నెల 26 నుంచి 29 వరకు ఢిల్లీలో వివిధ రూపాల్లో నిరసనలు తెలియజేస్తామని సీమాంధ్ర ఉద్యోగుల సంఘం తెలిపింది. కాగా, ఏపీ ఎన్జీవోల పిలుపు మేరకు ఉద్యోగులు ఈరోజు కేంద్ర కార్యలయాల ముట్టడి కార్యక్రమం చేపట్టారు.