రాజీనామాలతో విభజన ఆగదు : పనభాక

Panabaka-Lakshmiకేంద్ర మంత్రి పనబాక లక్ష్మికి సమైక్య సెగ తగిలింది. చైన్నై నుంచి హౌరామెయిల్ ఎక్స్ ప్రెస్ లో ఈరోజు తెలవారుజామున ఆమె గుంటూరు జిల్లా బాపట్ల చేరుకున్నారు. మంత్రి రాక గురించి సమాచారమందుకున్న సమైక్యవాదులు ఆమె ను అడ్దుకునేందుకు విఫల యత్నం చేశారు. ఆమె తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని సమైక్యవాదులు డిమాండ్ చేశారు. అయితే, రాజీనామాలతో విభజన ఆగదని.. తాను రాజీనామా చేయట్లేదని ఆమె తేల్చిచెప్పారు. దీంతో.. తీవ్ర ఆగ్రవేశాలకు గురైన సమైక్యవాదులు నిరసన తెలపడానికి సిద్ధమవ్వగా.. పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరును నిరసిస్తూ సమైక్యవాదులు బాపట్లలోని గడియారం స్తంభం సెంటర్లో బైఠాయించి నిరసన తెలిపారు. ఈ నేపథ్యంలో కేంద్ర మంత్రి నివాసం వద్ద పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు.