సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో మల్టీ స్టారర్ సినిమాలకు మరోసారి కొబ్బరి కాయ్ కొట్టింది టాలీవుడ్. ఇద్దరు ముగ్గురు హీరోలు కలసి సినిమా చేస్తున్నారు గానీ, అందులో నిజమైన మల్టీస్టారర్లు కనిపించడం లేదు. సమాన స్థాయి, ఇమేజ్, క్రేజ్ ఉన్న ఇద్దరు హీరోలు ఒక సినిమా కోసం జత కట్టలేదు. ఆలోటు త్వరలో తీరబోతోంది. అవును ఇమేజ్ పరంగా, అభిమానుల అండదండల పరంగా, పారితోషికం పరంగా అందనంత ఎత్తులో ఉన్న పవన్ కల్యాణ్, మహేష్బాబు కలసి ఓ సినిమా చేయబోతున్నారు. అవును.. వీరద్దరికీ సరిపడే కథని త్రివిక్రమ్ రూపొందించారట. త్రివిక్రమ్తో అటు మహేష్కీ, ఇటు పవన్కీ మంచి సాన్నిహిత్యం ఉంది. అత్తారింటికి దారేది లో మహేష్తో ఓ గెస్ట్ రోల్ చేయిద్దాం అనుకొన్నాడు త్రివిక్రమ్. కానీ మహేష్ ఒప్పుకోలేదు. చిన్న చిన్న పాత్రలు వద్దు, ఇద్దరికీ సరిపడ కథ ఉంటే చెప్పండి అని చెప్పాడట మహేష్. అందుకే ఈ భారీ మల్టీస్టారర్ ఆలోచన వచ్చింది. ప్రస్తుతానికి ఈ ప్రాజెక్ట్ పైప్లైన్ దశలో ఉంది. ఎందుకంటే పవన్, మహేష్ చేతుల్లో చాలా సినిమాలున్నాయి. అవి పూర్తయ్యాకే ఈ సినిమా మొదలయ్యే అవకాశాలున్నాయి.