రేణుక రాకతో గందరగోళం !

Renuka-Chowdharyటీ కాంగ్రెస్ నేతల సమావేశంలో గందరగోళం చోటు చేసుకుంది. మినిస్టర్స్ క్వార్టర్స్ లో జరుగుతున్న ఈ భేటీకి రేణుకా చౌదరి హాజరుకావడంపై ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ మంత్రి దామోదర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తెలంగాణకు వ్యతిరేకంగా మాట్లాడిన రేణుక సమావేశంలో ఎలా పాల్గొంటారని వారు ప్రశ్నించారు. తొలుత రేణుక సమావేశం జరుగుతున్న హాల్లోకి రాగానే పొన్నం బయటికివెళ్ళేందుకు సిద్ధపడ్డారు. అయితే జానారెడ్డి కల్పించుకుని.. అందరినీ కలుపుకుని వెళ్ళాలని సర్దిచెప్పారు. దీంతో సమావేశం ముందుకు సాగింది