మ‌ళ్లీ పూర్ణోద‌యం

Poornaఅప్పుడ‌ప్పుడూ తెర‌పై ఇలా ప్రత్యక్ష్యమై, అలా మాయ‌మ‌వుతోంది పూర్ణ‌. అల్లరి న‌రేష్ తో సీమ‌ట‌పాకాయ్‌లో చిందేసింది. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ క‌నిపించ‌లేదు. పూర్ణని తెలుగు ప్రేక్షకులు మ‌ర్చిపోయేలోగా – ‘అవును’ సినిమాలో క‌నిపించింది. ఈసారి భ‌య‌పెట్టడంలో విజ‌యం సాధించింది. ఆ సినిమా బాగానే ఆడినా, పూర్ణకు అవ‌కాశాలు రాలేదు. మ‌ళ్లీ ష‌రా మామూలే. పూర్ణ జాడ లేదు. ఇప్పుడు ఇంకోసారి తెర‌పై ప్రత్యక్షమ‌వ్వబోతోంది. కృష్ణ అల్లుడు సుధీర్ బాబు క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న చిత్రం మాయ‌దారి మ‌ల్లిగాడు. హ‌నుమాన్ ద‌ర్శక‌త్వం వ‌హిస్తున్నారు. ఈ సినిమాలో క‌థానాయిక‌గా పూర్ణని ఎంచుకొన్నారు. క‌నీసం ఇప్పుడైనా ఈ అవ‌కాశాన్ని అందిపుచ్చుకొని త‌న టాలెంట్ చూపిస్తుందా? లేదంటే ఎప్పట్లాగే పుష్కరానికి ఒక్కసారి అన్నట్టు వ‌చ్చి పోతుందా? చూడాలి మ‌రి.