48గంటల పాటు కృష్ణా జిల్లా బంద్

krishandirsist bandhసీమాంధ్రలో సమైక్య ఆందోళనలు కొనసాగుతూనే వున్నాయి. సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణాజిల్లాల్లో 48 గంటల బంద్ కు ఐకాస పిలుపునిచ్చింది. దీంతో.. జిల్లాలో విద్యాసంస్థలు, వస్త్ర వ్యాపారాలు, దుకాణాలు మూత పడ్డాయి. బంద్ కు ప్రజలు స్వచ్చంధంగా సహకరించి తమ ఆకాంక్షను తెలియజేస్తున్నారు. విద్యార్థి ఐకాస ఆధ్వర్యంలో నేడు జిల్లాలో ద్విచక్ర వాహన ర్యాలీని నిర్వహించారు. రాష్ట్రాన్ని సమైక్యంగానే వుంచాల్సిందేనని, సమైక్యంపై ప్రకటన వచ్చే వరకు తమ ఆందోళనలు కొనసాగుతూనే వుంటాయని ఐకాస నేతలు వెల్లడించారు.