ముజఫర్ మతృల సంఖ్య@ 48

muzaffarnagar_violenceమత ఘర్షణలతో ఉత్తరప్రదేశ్ అట్టుడుకుతోంది. ముజాఫర్ నగర్ లో రెండు వర్గాల మధ్య చెలరేగిన అల్లర్లలో మృతుల సంఖ్య 48కి చేరింది. నిన్నటి వరకు మృతుల సంఖ్య 40కి చేరుగా, తాజాగా నేడు మరో 8మంది మృతిచెందినట్లు సమాచారం. ఆర్మీ రంగప్రవేశంతో పరిస్థితి కుదుటపడినట్లుగా అనిపిస్తున్నప్పటికీ మృతుల సంఖ్య మాత్రం ఆగకపోవడంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గుర్తించని శవాలు ఇంకా ఉన్నాయని, మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని సమాచారం. కాగా, ముజఫర్ నగర్ జిల్లా వ్యాప్తంగా కర్ఫ్యూ కొనసాగుతూనే వుంది.