వేడి రాజకీయాలకు స్వాగతం

sonia-gandhiవైధ్యపరీక్షల నిమిత్తం అమెరికా వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ ఈరోజు (బుధవారం) తిరిగి రానున్నారు. గత నెలలో లోక్ సభలో ఆహార భద్రతా బిల్లుపై చర్చ సందర్భంగా ఛాతీలో నొప్పి రావడంతో.. ఆమెను ఎయిమ్స్ లో చేర్పించిన సంగతి తెలిసిందే. వివిధ పరీక్షలు నిర్వహించిన అనంతరం సోనియాను ఇంటికి తీసుకెళ్లారు. అటు పిమ్మట వైద్యపరీక్షల నిమిత్తం కుమార్తె ప్రియాంక తో కలసి ఆమె అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే, సోనియా వైద్య పరీక్షలు ముగించుకొని నేడు తిరిగిరానున్నారు. అధినేత్రి రాకతో మరోసారి రాష్ట్రంలో రాజకీయ వేడి రాజుకునే అవకాశం వున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే సోనియా రాగానే తెలంగాణ నోట్ ను కేబినెట్ ముందుకు తీసుకురానున్నట్లు హోంశాఖ వర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే.