సీఎంకు టీ- కాంగ్రెస్ నేతలు దూరం !

dk arunaముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిపై సమాచార శాఖ మంత్రి డి.కె. అరుణ మండిపడ్డారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్ది సీమాంధ్ర ప్రాంతానికి మాత్రమే ముఖ్యమంత్రిగా వ్యవహరిస్తున్నారని ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఒక ప్రాంత పక్షపాతిగా ఉంటున్నందునే..టీ-కాంగ్రెస్ నేతలు ఆయనకు దూరంగా ఉంటున్నారని అరుణ అన్నారు. ముఖ్యమంత్రి ఇరు ప్రాంతాల నేతలతో చర్చలు జరపాలని ఆమె కోరారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఎవరూ అడ్డుకోలేరని ఆమె స్పష్టం చేశారు. ఇక, రాష్ట్ర విభజన ఆపుతామంటూ సీమాంధ్ర కాంగ్రెస్ నేతలు ఆప్రాంత ప్రజలను మభ్యపెట్టడం మానుకోవాలని ఆమె సూచించారు. కాగా, రాజకీయంగా ముఖ్యమంత్రికి సన్నిహితంగా వుండే అరుణ సైతం కిరణ్ పై వ్యాఖ్యలు చేయడం విశేషం.