మూలిగే నక్కపై తాటికాయ పడినట్టుంది బీవీఎస్ఎన్ ప్రసాద్ పరిస్థితి. గత కొంతకాలంగా ఆయనకు సరైన విజయాల్లేవు. కెమెరామెన్ గంగతో రాంబాబు, దేవుడు చేసిన మనుషులు భారీ నష్టాలను మిగిల్చాయి. సాహసం సినిమాకి మంచి టాక్ వచ్చినా, వసూళ్లు అంతంత మాత్రమే సాధించింది. ఈ నష్టాలన్నీ అత్తారింటికి దారేది తీరుస్తుంది అనుకొంటే.. ఆ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియని పరిస్థితి. ఈ సినిమాకు భారీగా టేబుల్ ప్రాఫిట్ వచ్చిందట. కానీ లాభం ఏది?? సినిమా వాయిదా పడుతూనే ఉంది. అత్తారింటికి దారేది రూ. 50 కోట్ల భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. ఇలాంటి సినిమాలు ఆగిపోయితే నెలకు రూ.2 కోట్లు నష్టం వాటిల్లుతుంది. ఆల్రెడీ ఒక నెల ఆలస్యమైంది. అంటే.. రెండు కోట్లు నష్టమన్నమాట. ఈ సినిమా బయటకు వస్తే… తన కష్టాలు గట్టెక్కుతాయని నిర్మాత కలలు కంటున్నాడు. మరి అవి నిజమయ్యేది ఎప్పుడో..?