అది జరగాలంటే బ్రహ్మదేవుడు రావాలి!

somireddychandramohanreddyవైఎస్సార్సీపీ నుంచి సలహాలు తీసుకునే దుస్థితిలో టీడీపీ లేదని ఆ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. నమ్మిన వారి గొంతు కోసే తత్వం తమది కాదని, తెలంగాణా ప్రజలను వైఎస్సార్ సీపీలా టీడీపీ ద్వేషించదని, అలాగే సీమాంధ్ర ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకునేది లేదని ఆయన అన్నారు. ఏక పక్షంగా రాష్ట్ర విభజన చేయాలంటే జేజెమ్మ కాదు బ్రహ్మదేవుడు దిగిరావాలని సోమిరెడ్డి పేర్కొన్నారు.