యువత, సోలో సినిమాలతో తనని తాను నిరూపించుకొన్నాడు పరశురామ్. అయితే భారీ అంచనాలు పెట్టుకెళ్లిన సినిమాల్నీ నిరాశ పరచాయి. యువత తరవాత వచ్చిన ఆంజనేయులు, సోలో తరవాత తీసిన సారొచ్చారు ఫ్లాప్ల లిస్టులో చేరిపోయాయి. ఓ హిట్టు, ఓ ఫ్లాప్ అంటూ తన కెరీర్ని బ్యాలెన్స్ చేసుకొంటున్నాడీ దర్శకుడు. ఇప్పుడు నాగచైతన్యకు కథ చెప్పాడట. చైతూ కూడా ఓకే చెప్పినట్లు వినికిడి . ప్రస్తుతం చైతూ ఫుల్ బిజీలో ఉన్నాడు. అతని చేతిలో నాలుగు సినిమాలున్నాయి. ఇది ఐదోదన్నమాట. శ్రీనివాసరెడ్డి, కొండా విజయ్ కుమార్ ఆల్రెడీ కథలు చెప్పేశారు. ఇప్పుడు పరశురామ్ కూడా చేరాడు. వీరిలో ఎవరి సినిమా ముందుగా సెట్కి వెళ్తుందో మరి.