ఎలా ముందుకెళ్తారో షిండే చెప్పలేదు

lagadapatiషిండే ‘తెలంగాణ నోట్’ ప్రకటన మరింత గందరగోళం సృష్టించిందని ఎంపీ లగడపాటి రాజగోపాల్ అన్నారు. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని ఆయన నివాసంలో మీడియాతో మాట్లాడుతూ.. ప్రజల ఆకాంక్షను చూసైనా పార్టీలు తమ అభిప్రాయాలు, నిర్ణయాలు మార్చుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విభజన ప్రక్రియపై ఎలా ముందుకెళతారో షిండే ఇంతవరకు చెప్పలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన ప్రక్రియలో ఎదురయ్యే సమస్యలను ఎలా పరిష్కరిస్తారో స్పష్టంగా చెప్పలేదన్నారు. ఏపీఎన్జీవో సభ గురించి మాట్లాడుతూ.. సభ శాంతి, సామరస్యపూర్వకంగా సాగిందన్నారు. సభను క్రమశిక్షణతో నిర్వహించారని కితాబిచ్చారు.