తెలంగాణ తీర్మానాన్ని పాస్ కానివ్వం!

sailajanath-ministerరాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర శ్మశానంలా మారుతుందని అన్నారు మంత్రి శైలజానాథ్. ఢిల్లీలో ఏపీభవన్ ఎదుట విశాలాంధ్ర మహాసభ ప్రతినిధులు చేపట్టిన దీక్షకు శైలజానాథ్ సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ తీర్మానాన్ని ఎట్టిపరిస్థితుల్లోనూ పాస్ కానివ్వబోమని చెప్పారు. అందుకే తాము రాజీనామాలు చేయలేదని వివరించారు.