భవనం కూలి నలుగురి మృతి

building collapseఒడిశాలోని పూరీ పట్టణంలో ఆదివారం తెల్లవారుజామున రెండు అంతస్థుల భవనం పేకమేడలాకుప్పకూలింది. ఈ ప్రమాదంలో నలుగురు మృతి చెందగా, ఆరుగురు తీవ్రంగా గాయపడ్డారు. మృతుల్లో ఇద్దరు చిన్నారి బాలికలు కూడా ఉన్నారని తెలుస్తోంది. ఈ దుర్ఘటనకు సంబంధించిన సమాచారం తెలుసుకున్న వెంటనే పోలీసు ఉన్నతాధికారులు, పురపాలక సంఘం ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు సహాయక చర్యలను ముమ్మరం చేశారు.