ఏపీ ఎన్జీవోల సభ లైవ్ టెలీ కాస్ట్.. ?

apngosహైదరాబాద్ లోని ఎల్బీ స్టేడియంలో రేపు ’సేవ్ ఆంధ్రపదేశ్’ పేరిట ఏపీ ఎన్జీవోలు నిర్వహించ తలపెట్టిన సభ టీవీల్లో ప్రత్యక్ష ప్రసారం కావడానికి వున్న అడ్డంకులు తొలగిపోయినట్లు కనిపిస్తోంది. ఏపీ ఎన్జీవోల సభను టీవీల్లో పత్యక్ష ప్రసారం చేయరాదని దాఖలైన పిటిషన్ ను హైకోర్ట్ కొట్టేసింది. తమ అభ్యంతరాలను నగర డీజీపీ తెలియజేయాలని న్యాయస్థానం సూచించింది. ఈ దశలో ప్రతివాదులైన ఏపీ ఎన్జీవోలకు నోటీసులు జారీ చేసి వారి అభ్యంతరాలను వినలేమని కోర్టు స్పష్టం చేసింది. కాగా, పిటిషనర్ దరఖాస్తును పరిశీలించి తగు నిర్ణయం తీసుకోవాలని కోర్టు పోలీసులను ఆదేశించింది.