’సేవ్ ఆంధ్రపదేశ్’ కు అనుమతి

apngosఈ నెల 7న హైదరాబాద్ లోని ఎల్బీనగర్ స్టేడియంలో ’సేవ్ ఆంధ్రపదేశ్’ పేరుతో ఏపీ ఎన్జీవోలు నిర్వహించిన తలపెట్టిన సభకు పోలీస్ యంత్రాంగం అనుమతిని మంజూరు చేసింది. కొన్ని షరతులతో లోబడి సభ నిర్వహించుకోవాలని కూడా ఎన్జీవోలకు సూచించారు. ఆ షరతులలో ప్రధానంగా 1) ఉద్యోగులు, ఉద్యోగ సంఘాల నేతలు మాత్రమే సభకు హాజరవ్వాలి. వీరు తప్పక గుర్తింఫు కార్డులను వెంట తెచ్చుకోవాలి. 2) సభ మధ్యాహ్నం 2గంటలకు ప్రారంభమై సాయంత్రం 5గంటలకు ముగించాలి. 3) సభకు వచ్చేటప్పుడు కూడా గుంఫులుగా రాకుండా క్రమపద్దతిని పాటించాలి. మొదట ఏపీ ఎన్జీవోల సభకు అనుమతిని ఇవ్వకూడని భావించినప్పటికినీ.. అనుమతి ఇవ్వకున్నా.. సభ నిర్వహించేందుకు వారు సిద్దమవ్వడం.. తద్వారా పరిస్థితి అదుపు తప్పే ప్రమాదం వుందని భావించి షరతులతో కూడిన అనుమతిని ఇచ్చినట్లు తెలుస్తోంది.