తన తనయుడితో సినిమా తీసి హిట్ కొట్టలేకపోయాననే బాధ… ఎమ్మెస్ రాజుది. తూనీగ తూనీగ తో సుమంత్ అశ్విన్ని తెరపైకి తీసుకొచ్చారాయన. అయితే ఆ సినిమా బోల్తా కొట్టింది. ఇప్పుడు అంతకు ముందు ఆ తరవాతతో అశ్విన్ తనని తాను నిరూపించుకొన్నాడు. అందుకే… ఇప్పుడు ఎమ్మెస్ రాజు పుత్రోత్సాహంలో ఉన్నారు. కొడుకు హిట్ని ఆయనా ఎంజాయ్ చేస్తున్నారు. ”సుమంత్కి ఓ మంచి సినిమా ఇచ్చిన దర్శక నిర్మాతలకు థ్యాంక్స్. మంచి కథే కాదు, మంచి నిర్మాత, దర్శకుడు కూడా దొరకాలి. ఈ సినిమాతో సుమంత్కి వారిద్దరూ లభించారు. అన్ని విభాగాల్లోనూ సుమంత్ రాణించాడు. ఇలాంటి సినిమా నేనెందుకు తీయలేకపోయానే.. అనే జలసీ కూడా కాస్త ఉంది..” అంటున్నారాయన.