20రోజుల్లో తెలంగాణపై కేబినేట్ నోట్.. !

shindeఇరవై రోజుల్లో తెలంగాణపై తీర్మాణం కేబినెట్ ముందుకు వస్తుందని కేంద్ర హోంశాఖ మంత్రి సుశీల్ కుమార్ షిండ్ వెల్లడించారు. తీర్మానాన్ని పరిశీలన కోసం న్యాయశాఖ కూడా పంపిస్తామని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్రలో సమైక్య ఉద్యమం ఎగసిపడుతున్న నేపథ్యంలో.. షిండే చేసిన వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ఈ నెల 6న ముగియనున్న నేపథ్యంలో.. ఇక తెలంగాణ ప్రక్రియను వేగవంతం చేయాలని అధిష్టానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ నోట్ తోనే విభజన ప్రక్రియ అధికారికంగా ప్రారంభమయినట్లు భావించవచ్చని విశ్లేషకులు అంటున్నారు.