మరోసారి సీమాంధ్ర ఎంపీల సస్పెన్షన్ !

Meira_Kumarసీమాంధ్ర కాంగ్రెస్, టీడీపీ ఎంపీలు మరోసారి లోక్‌సభ నుంచి సస్పెండ్‌ కు గురయ్యారు. ఈరోజు (సోమవారం) ఉదయం సభ ప్రారంభం కాగానే ఎప్పటిలాగానే సీమాంధ్ర కాంగ్రెస్, తెదేపా ఎంపీలు సమైక్యనినాదాలు చేస్తూ.. సభను హోరెత్తించారు. దీంతో.. స్వీకర్ మీరా కుమార్ సీమాంధ్రకు చెందిన 5గురు కాంగ్రెస్, 4గురు తెదేపా ఎంపీలను ఆర్టికల్ 374ప్రకారం సభ నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది. సభ నుండి సస్పెండ్ కు గురైన వారిలో సాయిప్రతాప్, అనంత వెంకట్రామిరెడ్డి, లగడపాటి, బాపిరాజు, మాగుంట, టీడీపీ ఎంపీలు శివప్రసాద్, నిమ్మల కిష్టప్ప,కొణతల నారాయణ, కొణకళ్ల ఉన్నారు.