పెట్రోల్ ధర పెంపుపై సీపీఐ నిరసన

CPI-protestపెట్రోల్ ధరల పెంపుపై విపక్షాలు భగ్గుమంటున్నాయి. ఈమేరకు ఆదివారం వరంగల్‌లో సీపీఐ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. పెంచిన పెట్రోల్ ధరలను కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా తగ్గించాలని లు డిమాండ్ చేశారు. తంతి తపాల కూడలి వద్ద ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ ధర్నా నిర్వహించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలవల్లే ధరలు పెరిగాయని, అందుకే ప్రస్తుత ధరలపై బాధ్యత తీసుకుని, పెంచిన ధరలను ఉపసంహరించాలని సీపీఐ నాయకులు డిమాండ్ చేశారు.