రాజీనామాలు చేస్తారా.. ?

Union minister from Seemandhraసీమాంధ్ర కేంద్ర మంత్రులు, ఎంపీలు రాజీనామాల విషయంపై తీవ్రంగా ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. రాజీనామాలు చేసి ఉద్యమంలో పాల్గొనకపోతే.. తీవ్ర పరిణామాలుంటాయని నిన్న ఏపీ ఎన్జీవోలు హెచ్చరించిన నేపథ్యంలో.. కేంద్ర మంత్రులు, ఎంపీలు ఈరోజు పార్లమెంట్ సెంట్రల్ హాల్ లో సమావేశమయ్యారు. సెప్టెంబర్ 2న మరోసారి సమావేశమయి రాజీనామాలపై నిర్ణయం తీసుకోవాలని వారు నిర్ణయించుకున్నారు. సీమాంధ్ర మంత్రులు, ఎంపీలు సెప్టెంబర్ 2న రాజీనామాలు చేస్తారా..? లేదా ఎప్పటిలాగే చర్చలు, సమావేశాలని సాగదీస్తారా.. ? అనేది ఆసక్తిగా మారింది. రాజీనామాలు చేయడాన్ని ఒకరిద్దరు కేంద్ర మంత్రులు వ్యతిరేకిస్తున్నట్లు తెలుస్తోంది.