వాయిదా పర్వం!

Lok-Sabhaలోక్ సభలో వాయిదాల పర్వం కొనసాగుతోంది. సభ ప్రారంభం అవగానే రూపాయి దారుణంగా పతనమవుతోంది, ప్రభుత్వం తగు చర్యలు ప్రారంభించకుండా ఏం చేస్తోందంటూ విపక్షాలు ఆందోళనకు దిగాయి. దీంతో సభ రెండు సార్లు వాయిదా పడింది. రెండో వాయిదా అనంతరం ప్రారంభమైన సభ… రేపు ప్రధాని ప్రకటన చేయడం కాదు, తక్షణం రూపాయి పతనం పై ప్రకటన చేయాలని డిమాండ్ చేస్తూ విపక్ష సభ్యలు పెద్దఎత్తున ఆందోళనకు దిగారు. దీంతో స్పీకర్ సభను మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా వేశారు.