రోడ్డుపై ఇద్దరిని చితకబాదిన ఘటన – రామ్చరణ్ని వెంటాడుతూనే ఉంది. రెండు నెలల క్రితం పట్టపగలు, హైదరాబాద్ నడి రోడ్డున రామ్చరణ్ సమక్షంలోనే అతని సిబ్బంది – ఇద్దరు సాప్ట్వేర్ ఉద్యోగులపై విరుచుకుపడ్డారు. వాళ్లు బట్టలు చిరిగేలా చితగ్గొట్టారు. ఆ సంఘటన సమయంలో రామ్చరణ్ అక్కడే ఉన్నాడని సాక్ష్యాలు సేకరించినా, చరణ్ మాత్రం నేనసలు కారు దిగలేదని బుకాయించాడు. బాధితులు కూడా వెనక్కి తగ్గడంతో పోలీసు స్టేషన్లో కేసు నమోదవలేదు. ఇప్పుడు ఈ ఉదంతాన్ని మళ్లీ తవ్వుతున్నారు. ఓ న్యాయవాది మానవ హక్కుల కమీషన్ను ఆశ్రయించి బాధితుల తరపున పిటీషన్ వేశాడు. కమీషన్ కూడా చరణ్ని వేలెత్తి చూపించింది. దాంతో ఈ కేసు మళ్లీ చరణ్ మెడకు చుట్టుకోబోతోంది. బంజారా హిల్స్ స్టేషన్లో చరణ్పై కేసు నమోదైనట్టు సమాచారం. పూర్తి వివరాలు మరికొన్ని గంటల్లో తెలిసే అవకాశాలున్నాయి.