ఆమెను ప్రశ్నించారు.. !

geeta reddyజగన్ అక్రమాస్తుల కేసు విచారణలో భాగంగా మంత్రి గీతారెడ్డిని సీబీఐ అధికారులు ప్రశ్నించారు. హైదరాబాద్ లోని ఆమె నివాసానికి నిన్న రాత్రి 10 గంటల సమయంలో వెళ్లి, లేపాక్షి నాలెడ్జి హబ్, ఇందూ ప్రాజెక్టులకు భూ కేటాయింపులలో జరిగిన అవకతవకలపై ప్రశ్నించారు. లేపాక్షి నాలెడ్జ్ సెంటర్ కు గీతారెడ్డి భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా వున్న సమయంలో ప్రభుత్వం 800 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే. కాగా, ఇదే కేసులో మరికొంత మంది మంత్రులను కూడా సీబీఐ ప్రశ్నించనున్నట్లు సమాచారం.