ఘనంగా ’గోకులాష్టమి’ వేడుకలు !

Janmashtami-దేశ వ్యాప్తంగా శ్రీకృష్ణాష్టమి శోభ సంతరించుకుంది. గోకులాష్టమి సందర్భంగా.. దేశవ్యాప్తంగా వున్న ఇస్కాన్ ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. శ్రీకృష్ణుని జన్మస్థలమైన మధురలో ఉదయం నుంచే భక్తులు బారులు తీరారు. కీర్తనలు, భజనలతో కృష్ణుని ఆలయాలు మారుమ్రోగుతున్నాయి. మనరాష్ట్రంలోనూ గోకులాష్టమి శోభ సతరించుకుంది. సికింద్రాబాద్‌ లోని ఇస్కాన్ దేవాలయాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పెద్ద సంఖ్యలో భక్తులు అక్కడకు చేరుకుని కృష్ణున్ని దర్శించుకుంటున్నారు. భజనలు, కీర్తలతో ఆలయం మారుమోగుతోంది. తిరుమలలోని శ్రీవారి ఆలయంలో శుక్రవారం శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలను ఘనంగా నిర్వహించడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇస్కాన్ భక్తులు కీర్తనలు, భజనలతో మునిగిపోయారు.