రామ్చరణ్ సెప్టెంబరు 6న వచ్చేయడానికి సిద్ధమైపోయాడు – ఈ విషయాన్ని తుఫాన్ ఆడియో వేదికపై మరోసారి ధృవీకరించాడు. తుఫాన్ ఆడియో విడుదల కార్యక్రమం మంగళవారం రాత్రి హైదరాబాద్లో జరిగింది. వెంకటేష్ ముఖ్య అతిథిగా పాల్గొని తొలి సీడీని విడుదల చేశారు. చరణ్ దుమ్ము దులపబోతున్నాడు – అభిమానులకు పండగే, అంటూ వెంకీ మెగా ఫ్యాన్స్ని ఉత్సాహపరిచారు. ఆ తరవాత చెర్రీ కూడా కాస్త ఆవేశంగా మాట్లాడాడు ”నువ్ బాలీవుడ్కి ఎందుకు వెళ్తున్నావ్? ఆ అవసరం ఏమొచ్చింది? అని అందరూ అడిగారు. నేను అవసరం కోసం ఏ పనీ చేయను. జంజీర్ సినిమా రీమేక్ అనగానే భయపడిపోయా. చేయాలో వద్దో తేల్చుకోలేకపోయా. కథ నచ్చక పోతే సినిమా మానేయ్, అంతే తప్ప భయపడి వదులుకోవద్దు… అని డాడీ చెప్పారు. అందుకే ఈ సినిమా ఒప్పుకొన్నా…” అని చరణ్ చెబుతున్నాడు. అభిమానుల నమ్మకాన్ని వమ్ముచేయను… అని ధీమాగా చెబుతున్నాడు చరణ్.