సీమాంధ్ర నేతలు ప్రజలను రెచ్చగొడుతున్నారని తెరాస ఎమ్మెల్యే కేటీఆర్ ఆరోపించారు. ముఖ్యమంత్రిని కంట్రోల్ చేస్తే చాలు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులన్ని చక్కబడుతాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్ లు సమైక్య ఉద్యమానికి నేతృత్వం వహిస్తున్నారని ఆయన అన్నారు. ఇక జైల్లో దీక్ష చేస్తున్న జగను జాతి గౌరవాన్ని పెంచిన మహాత్మ గాంధీ, భగత్ సింగ్ తో పోల్చడం వారిని అవమానించడమేనని అన్నారు. జగన్ ను దావూద్ ఇబ్రహీం, చార్లెస్ శోభరాజ్.. తదితరులతో పోలిస్తే బాగుంటుందని ఆయన సూచించారు.