చాలాకాలం తరవాత తమ్మారెడ్డి భరద్వాజా మెగాఫోన్ పట్టారు. ప్రతిఘటన సినిమా కోసం. ఇందులో ఛార్మి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాకి ఎలాగైనా పబ్లిసిటీ తెచ్చుకోవాలని పిచ్చప్రయత్నాల్లో ఉన్నారు తమ్మారెడ్డి. అందుకే గెస్ట్రోల్లో నటింపచేయాలని పలువురు అగ్రహీరోలను సంప్రదిస్తున్నారట. ఆయనకున్నపరిచయాలతో ఎలాగైనా సరే ఒక్క కథానాయకుడినైనా ఒప్పించాలని చూస్తున్నారు. ఇప్పుడాయన దృష్టి పవన్పై పడింది. ప్రతిఘనటలో చిన్న అతిథి పాత్ర కోసం పవన్తో సంప్రదింపులు మొదలెట్టాడు తమ్మారెడ్డి. అయితే అది ఎంత వరకూ ఫలిస్తాయో చూడాలి. కనీసం వాయిస్ ఓవర్ చెప్పించడానికైనా ట్రై చేస్తున్నాడట. మరి పవన్ కరుగుతాడో లేదో చూడాలి.