తమ గొంతును ప్రపంచానికి వినిపించడానికి ట్విట్టర్ని వేదికగా తీసుకొంటోంది యువతరం! సినిమావాళ్లకూ ఇదే మార్గం. మంచు లక్ష్మి ప్రసన్న ట్విట్టర్లలో చురుగ్గా ఉంటోంది. ఆమెను ఫాలో అయ్యేవారి సంఖ్యా ఎక్కవే. అందులో ఓ ప్రత్యేకమైన వ్యక్తి చేరారిప్పుడు. ఆయనే గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడి. ఇటీవల మోడీ హైదరాబాద్ వచ్చారు. ఓ బహిరంగ సభలో పాల్గొనడానికి. ఆయన్ని సినిమావాళ్లంతా మర్యార పూర్వకంగా కలుసుకొన్నారు. అందులో మంచు కుటుంబం కూడా ఉంది. ఆ సందర్భంలో మంచు లక్ష్మి వాక్పటిమ, ఆమె ఆలోచనలూ చూసిన మోడీ.. ట్విట్టర్లో ఆమెను అనుసరిస్తారని చెప్పారట. అలా చెప్పడమే కాదు, రక్షాబంధన్ రోజున తన ట్విట్టర్ ఎకౌంట్లో 28మంది మహిళలను ఫాలో అయ్యారు. అందులో మంచు లక్ష్మి కూడా ఉండడం విశేషం. మోడీ 600మందిని ఫాలో అవుతున్నారు. ఇప్పుడు ఈ 28 మంది కూడా జతకలిశారన్నమాట. ప్రపంచమంతా మోడీని ఫాలో అవుతుంటే – ఆయన నన్ను ఫాలో అవుతున్నారు అని గర్వంగా చెబుతోంది ప్రసన్న.