అనంతరపురంలో 72 గంటల బంద్ !

Seemandhrసమైక్యాంధ్ర కు మద్దతు సీమాంధ్రలో రోజురోజుకు ఆందోళనలు ఉదృతం అవుతున్నాయి. తాజాగా, అనంతపురం జిల్లాలో 72గంటల పాటు బంద్ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా దుకాణాలు, వాణిజ్య సముదాయాలు స్వచ్చంధంగా బంద్ లో పాల్గొంటున్నట్లు తెలుస్తోంది. ప్రభుత్వ సంస్థలతో పాటుగా ప్రైవేటు వాహనాలు, ఆటోలు కూడా బంద్ కావడంతో ప్రజలు తీవ్ర ఇంబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. మరోవైపు సమైక్యాంధ్రకు మద్దతుగా ప్రకాశం జిల్లా మార్కాపురం శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డి ఈరోజు (సోమవారం) పాదయాత్ర ప్రారంభించారు. మార్కాపురం నుంచి ఒంగోలు వరకు రెండు రోజుల పాటు కందుల పాదయాత్ర కొనసాగించనున్నారు.