అశోక్ సింఘాల్ అరెస్ట్

singal‘కోసి పరాక్రమ యాత్ర’ను విశ్వహిందూ పరిషత్ (వీహెచ్ పీ) నేటి నుంచి సెప్టెంబర్ 13 వరకూ నిర్వహిస్తోంది. ఈ యాత్రకు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోయినా, యాత్ర చేసి తీరుతామని వీహెచ్ పీ ప్రకటించింది. ఈ ఉదయం యాత్ర ప్రారంభం కాగానే పోలీసులు వీహెచ్ పీ నేతలను అరెస్ట్ చేశారు. ముందు జాగ్రత్త చర్యగా వీహెచ్ పీ అధ్యక్షుడు అశోక్ సింఘాల్ మరో నేత ప్రవీణ్ తొగాడియాలను అదుపులోకి తీసుకున్నారు. అయోధ్యలో నేటి నుంచి జరగనున్న కోసీ పరిక్రమ యాత్రలో పాల్గొనేందుకు వీరు లక్నో ఎయిర్ పోర్టుకు 10.20గంటల సమయంలో చేరుకోగా.. ముందస్తు ప్రణాళికలో భాగంగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.