మళ్లీ కమిటీలు అంటే సహించేది లేదు

T-Harish-Raoరాష్ట్ర విభజనపై మళ్లీ కమిటీలు అంటే సహించేది లేదని తెరాస సీనియర్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. కమిటీల పేరుతో కాలయాపన చేస్తే సహించేది లేదని ఆయన ఆన్నారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఇంకా ఆలస్యం అయితే.. తెలంగాణ ప్రాంతంలో అశాంతి ఏర్పడుతుందని హరీష్ రావు వ్యాఖ్యానించారు. లోక్‌సభలో తెలంగాణ రాష్ట్రం కోసం గతంలో తెలంగాణ ఎంపీలను సస్పెండ్ చేసినప్పుడు మాట్లాడని బిజెపి ఇప్పుడెలా మాట్లాడుతుందని హరీష్‌రావు ప్రశ్నించారు. తెలంగాణ ప్రత్యేక రాష్టం ఏర్పాటుపై బీజేపీ అనుసరిస్తున్న వైఖరి సందేహాస్పదంగా ఉందని ఆయన అన్నారు. దీనిపై సుష్మాస్వరాజ్ వివరణ ఇవ్వాలని హరీష్ రావు డిమాండ్ చేశారు.