విభజన తీరు బాధాకరం!

sushma_swarajఆంధ్రప్రదేశ్ ను కాంగ్రెస్ విడదీసిన తీరు ఆందరినీ బాధిస్తోందని లోక్ సభలో ప్రధాన ప్రతిపక్ష నేత సుష్మాస్వరాజ్ అన్నారు. అందుకే సభలో రగడ జరుగుతోందన్నారు. రాష్ట్ర విభజన తీరుపై సొంత పార్టీ ముఖ్యమంత్రే వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. మంత్రులు, ఎమ్మెల్యేలు పార్లమెంటు ఆవరణలో ధర్నా చేశారన్నారు. సభ సజావుగా నడపటం లేదంటూ కేంద్రంపై విరుచుకుపడ్డా సుష్మా, రాష్ట్ర విభజన తీరుపై కాంగ్రెస్ వైఖరిని తప్పుబట్టారు. తాము మూడు కొత్త రాష్ట్రాలు ఇచ్చినా ఇంత రాద్ధాంతం జరగలేదని ఆమె అన్నారు.