సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన

dharmanaమాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు హైదరాబాదులోని దిల్ కుషా అతిధి గృహంలో సీబీఐ ముందు హాజరయ్యారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆయనను అనంతపురం జిల్లాలో ఇందూ కంపెనీకి సంబంధించి లేపాక్షి నాలెడ్జి ప్రాజెక్టుకు భూకేటాయింపుల వ్యవహారంలో సీబీఐ విచారిస్తోందని సమాచారం.