జూనియర్ ఎన్టీఆర్ తాజా చిత్రం ‘రామయ్యా వస్తావయ్యా’. హరీష్శంకర్ దర్శకుడు. సమంతా, శృతిహాసన్ హీరోయిన్స్. ప్రస్తుతం ఈ చిత్రానికి సంభందించి పాటల చిత్రకరణ జరుగుతోంది. ఇందులో భాగంగ ఈ నెల 26న జర్మని లో రెండు పాటలను షూట్ చేయనున్నారు. ఒక పాటని ఎన్.టి.ఆర్ – సమంతలపై, మరొక సాంగ్ ని ఎన్.టి.ఆర్ – శృతి హసన్ లపై చిత్రీకరించనున్నారు. ఈ రెండు పాటల చిత్రీకరణ తో మేజర్ షూటింగ్ పార్ట్ ముగియనుంది. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంను సెప్టెంబర్ 27న విడుదల చేయడానికి సన్నహాలు చేస్తున్నారు. బాద్షా తర్వాత ఎన్టీఆర్, గబ్బర్సింగ్ తర్వాత హరీశ్ శంకర్ చేస్తున్న సినిమా కావడంతో ఈ చిత్రంపై బారీ అంచనాలు వున్నాయి.