వీహెచ్ ను అడ్దుకోవడం సరికాదు !

digvijaysinghతిరుమలలో కాంగ్రెస్ సీనియర్ నేత వి. హనుమంతరావును సమైక్యవాదులు అడ్డుకోవడాన్ని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ తప్పుబట్టారు. ఎవరైనా.. ఎక్కడైన తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కువుందని ఆయన పేర్కొన్నారు. వీహెచ్ పై దాడి చేయడం సరైన పని కాదని ఆయన అభిప్రాయపడ్డారు. ఇరు ప్రాంతాల నేతలు సంయమనం పాటించాలని ఆయన సూచించారు. ఇప్పటికే ఈ ఘటనపై తెలంగాణ వాదులు తీవ్రంగా ఖండించిన విషయం తెలిసిందే.