ఇదో కోదండ రహస్యం

kodandaramతెలంగాణా జె ఎ సి చైర్మన్ కోదండరాం, కో చైర్మన్ శ్రీనివాసగౌడ్ రాత్రికి రాత్రి డిల్లీ వెళ్లి తెల్లవారేసరికి హైదరాబాద్ కు రహస్యంగా వెళ్లి రావటం తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తోంది. ఎవరికీ చెప్పకుండా ఎవరికీ తెలియకుండా వీళ్ళిద్దరూ ఈ రహస్య ప్రయాణం చేయటం పట్ల జె ఎ సి నేతలు మండిపడుతున్నారు. ఈ ప్రయాణం వెనుక అంతరార్ధం ఏమిటని వారు బాహాటంగానే ప్రశ్నిస్తున్నారు. అయితే తాము అసలు డిల్లీ వెళ్ళనే లేదని, హైదరాబాద్ లోనే ఉన్నామని కోదండరాం బుకాయిస్తున్నారు. వీరిరువురూ శుక్రవారం సాయంత్రం 5-20 గంటలకు స్పైస్ జెట్ విమానంలో డిల్లీ వెళ్ళారని, తిరిగి శనివారం ఉదయం 8-20 గంటలకు ఎన్.జి. విమానంలో హైదరాబాద్ వచ్చారని, ఇందుకు తమవద్ద ఆధారాలున్నాయని ఆంధ్రజ్యోతి దినపత్రిక ఆదివారం సంచికలో పేర్కొంది. గతంలో కూడా వీరిరువురూ ఇలానే రహస్యంగా డిల్లీ వెళ్లి వచ్చారని, ఇలా రహస్యంగా డిల్లీ వెళ్లి రావటాన్ని ఎలా అర్ధం చేసుకోవాలని జె ఎ సి నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాగా శుక్రవారం రాత్రి కోదండరాం, శ్రీనివాసగౌడ్ లు డిల్లి లో ఆంటోని, దిగ్విజయ్ సింగ్ లను కలిసి చాలాసేపు చర్చలు జరిపినట్లు సమాచారం.