మంత్రికి సమైక్య సెగ !

raghuveera-reddyమంత్రి రఘువీరా రెడ్డికి సమైక్య సెగ తగిలింది. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొనడానికి అనంతపురం జిల్లాకు వచ్చిన మంత్రి రఘువీరా రెడ్డిని న్యాయవాదులు అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా రఘువీరా రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. దీంతో.. అక్కడ కాస్త ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మరోవైపు రఘువీరా ఎదుట ఎమ్మెల్యే గుర్నాథ్‌రెడ్డి సమైక్య గళం వినిపించారు. అయితే రఘువీర అదేమీ పట్టించుకోకుండా తన ప్రసంగాన్ని కొనసాగించారు. దీంతో.. గుర్నాథ రెడ్డి చేసేదేమీ లేక తనకు కేటాయించిన సీట్లో కూర్చున్నట్లు సమాచారం.