మరో కమిటీ అవసరం లేదు

Digvijay_Singhరాష్ట్ర విభజన నేపథ్యంలో.. తలెత్తె సమస్యలపై ఆంటోని కమిటీ వుందని.. మరో కమిటీ అవసరం లేదని రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ ఛార్జ్ దిగ్విజయ్ సింగ్ స్పష్టం చేశారు. ఈరోజు ఢిల్లీలో దిగ్గీ రాజా విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర విభజన చాలా సున్నితమైన విషయమని, సీమాంధ్ర నేతల అభిప్రాయాలను పరిశీలిస్తామని, ఎవ్వరూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయవద్దని ఇరు ప్రాంత నేతలను గట్టిగా హెచ్చరించామని అన్నారు. పార్లమెంట్ లో బిల్లు పెట్టినప్పుడు జాతీయ పార్టీలు పార్లమెంట్ లో, ప్రాంతీయ పార్టీలు అసెంబ్లీలో తమ అభిప్రాయాలను వెల్లడించవచ్చని ఆయన అన్నారు.